లంక లీగ్లో జట్టును కొన్న సల్మాన్ తమ్ముడు
ABN , First Publish Date - 2020-10-22T08:59:03+05:30 IST
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ఒక జట్టును కొనుగోలు చేశాడు.
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ఒక జట్టును కొనుగోలు చేశాడు. స్వతహాగా సినీ నిర్మాతైన సొహైల్ టీ20 క్రికెట్పై ఆసక్తితో ఎల్పీఎల్లోని క్యాండీ జట్టును సొంతం చేసుకున్నాడు. ఈ జట్టు తరఫున వెస్టిండీస్ విధ్యంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ఆడనున్నాడు. గేల్తో పాటు లంక ఆటగాళ్లు కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, నువాన్ ప్రదీప్, ఇంగ్లండ్ పేసర్ ప్లంకెట్ ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. వచ్చే నవంబరు 21న ప్రారంభం కానున్న ఈ లీగ్ డిసెంబరు 13 వరకు హంబన్తోట, పల్లెకెలే మైదానాల్లో జరగనుంది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డుప్లెసి, జమైకా సిక్సర్ల పిడుగు ఆండ్రీ రస్సెల్, లంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ వంటి స్టార్లు లీగ్లోని ఇతర జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు.