కోలుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్
ABN , First Publish Date - 2022-02-11T12:24:12+05:30 IST
పాముకాటుకు గురై ప్రమాదకర స్థితిలోకి వెళ్లిన భాస్కర్నాయుడు కోలుకున్నారు.
చిత్తూరు జిల్లా/రేణిగుంట : పాముకాటుకు గురై ప్రమాదకర స్థితిలోకి వెళ్లిన భాస్కర్నాయుడు కోలుకున్నారు. రక్తపింజరి పాము కాటేయడంతో గత నెల 28న ఆయన ఆసుపత్రిపాలయ్యారు. పరిస్థితి విషమించి వెంటిలేటర్ మీదకు వెళ్లారు. పదివేల పాములు పట్టిన భాస్కర్నాయుడు పరిస్థితికి ఆయన కుటుంబ సభ్యులతోపాటూ భక్తజనం తీవ్రంగా కలతచెందారు. అమర ఆసుపత్రిలో చేరి కోలుకున్న భాస్కర్నాయుడు గురువారం అక్కడే మీడియాతో మాట్లాడారు. తన సేవలు ఇంకా అవసరమంని వెంకటేశ్వరస్వామి కోరుకోవడం వల్లే తాను కోలుకున్నానని చెప్పారు. ఆసుపత్రి వైద్యులు సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. మీడియా సమావేశంలో అమర ఆసుపత్రి డాక్టర్లు ప్రణీత్, రాకేష్, హర్షితారెడ్డి, అనిల్, రాధికారెడ్డిలు పాల్గొన్నారు. కాగా, రెండు మూడు రోజుల్లో భాస్కర్ నాయుడిని డిశ్చార్జి చేస్తామని వైద్యుల బృందం తెలిపింది.