Srisailam జలాశయానికి స్వల్పంగా వరద
ABN , First Publish Date - 2022-05-24T13:58:28+05:30 IST
జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది.
నంద్యాల: జిల్లాలోని శ్రీశైలం(Srisailam) జలాశయానికి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో: 4,311 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : నిల్గా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం : 815.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.807 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటినిల్వ 37.5055 టీఎంసీలకు చేరింది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.