సిరిసిల్ల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ
ABN , First Publish Date - 2020-02-22T08:05:43+05:30 IST
సిరిసిల్ల ఎస్సీ హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోత్స్న డిమాండ్ చేశారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల ఎస్సీ హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోత్స్న డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్అలీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిందితుడిని పోలీసు కస్టడీకి ఎందుకు అడగలేదని నిలదీశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.