20 టీఎంసీలకు చేరిన సింగూర్ జలాశయం నీరు

ABN , First Publish Date - 2020-09-24T13:34:34+05:30 IST

జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పోటెత్తడంతో జలాశయం నీరు 20 టీఎంసీలకు చేరింది.

20 టీఎంసీలకు చేరిన సింగూర్ జలాశయం నీరు

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పోటెత్తడంతో జలాశయం నీరు 20 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 10,177  క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటిమట్టం 20.284 టీఎంసీలకు చేరింది. మరో 9.9 టీఎంసీల నీటి రాకతో సింగూరు జలాశయం నిండు కుండలా మారనుంది. 

Updated Date - 2020-09-24T13:34:34+05:30 IST