ప్రీ క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2021-03-04T09:34:57+05:30 IST

స్విస్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. డబుల్స్‌లో సాత్విక్‌, అశ్విని జోడీలు ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటి ముఖం పట్టాడు...

ప్రీ క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్‌

  • సాత్విక్‌, అశ్విని జోడీలు కూడా
  • ప్రణయ్‌ అవుట్‌ 
  • స్విస్‌ ఓపెన్‌


బాసిల్‌: స్విస్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. డబుల్స్‌లో సాత్విక్‌, అశ్విని జోడీలు ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటి ముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రెండో సీడ్‌ సింధు 21-16, 21-19తో నెస్లిహన్‌ యజిట్‌ (టర్కీ)పై వరుస గేముల్లో నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ శ్రీకాంత్‌ 18-21, 21-18, 21-11తో సమీర్‌ వర్మపై, సౌరభ్‌ వర్మ 21-19, 21-18తో క్రిస్టియన్‌ క్రిచ్‌మయెర్‌ (స్విస్‌)పై, అజయ్‌ జయరామ్‌ 21-12, 21-13తో సిత్తికోమ్‌ తమాసిన్‌ (థాయ్‌)పై గెలిచారు. కాగా, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ 19-21, 21-9, 17-21తో మార్క్‌ కలిజౌ (నెదర్లాండ్స్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జోడీ 21-18, 19-21, 21-16తో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టోఫర్‌-మాథ్యూపై, అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జంట 21-5, 21-19తో జర్మనీకి చెందిన అన్నాబెల్లా జేగర్‌-స్టయిన్‌ కుస్పర్ట్‌పై నెగ్గాయి. 


Updated Date - 2021-03-04T09:34:57+05:30 IST