సిద్దిపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాలుగో జాబితా విడుదల
ABN , First Publish Date - 2021-04-19T23:06:24+05:30 IST
ఈ నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల నాలుగో
సిద్దిపేట: ఈ నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. 2వ వార్డు (నర్సపూర్ ) నుంచి నాయిని చంద్రం మాదిగ, 12వ వార్డు నుంచి తెల్జీరి రేఖా శ్రీనివాస్ యాదవ్, 13వ వార్డు నుంచి రాపెల్లి విఠోబ నిలబడతారని ఆయన ప్రకటించారు. 25వ వార్డు నుంచి గుండ్ల యోగి, 32వ వార్డు నుంచి బందారం శ్రీలత రాజు ( డిష్ రాజు), 39వ వార్డు నుంచి దీప్తి నాగరాజు పోటీ చేస్తారని మంత్రి తెలిపారు.