కర్నూలు జిల్లాలో హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2021-11-01T01:20:20+05:30 IST
జిల్లాలోని పలువురు హెచ్ఎంలకు ఆర్జేడీ షోకాజ్
కర్నూలు: జిల్లాలోని పలువురు హెచ్ఎంలకు ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేసారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్లో భాగంగా విద్యార్థులకు చిక్కీలు, గుడ్లు పంపిణీ చేయాలి. కానీ వీటిని పంపిణీ చేయని కారణంగా భారీ సంఖ్యలో హెచ్ఎంలకు కడప ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేసారు. గుడ్లు, చిక్కీలు అన్సైజ్ ఉండటం వల్లే సప్లై చేయలేదని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.