సీఎంను పొగడాలి..!: మాజీ ఎంపీ చేగొండి

ABN , First Publish Date - 2021-05-17T09:28:40+05:30 IST

‘‘సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నీతిగా, నిజాయితీగా, అత్యంత అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారంటూ రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ పొగడాలి.

సీఎంను పొగడాలి..!: మాజీ ఎంపీ చేగొండి

పాలకొల్లు, మే 16: ‘‘సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నీతిగా, నిజాయితీగా, అత్యంత అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారంటూ రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ పొగడాలి. అపుడు ఎంపీ రఘురామకృష్ణరాజు లాగా క్రిమినల్‌ కేసులు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు’’ అని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరామ జోగయ్య అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన ఈ మేరకు ‘ఆంధ్రజ్యోతి’తో వ్యాఖ్యానించారు. 


ప్రభుత్వ కక్షసాధింపు చర్య 

జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రసంగాలను ప్రసారం చేసినందుకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 5లపై కేసులు వేయడం దుర్మార్గమైన చర్యని ఐజేయూ కార్యవర్గ సభ్యుడు దూసనపూడి సోమసుందర్‌ విమర్శించారు. కక్ష సాధింపులకు ప్రభుత్వం పాల్పడడాన్ని ఖండిస్తున్నానని సోమసుందర్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-17T09:28:40+05:30 IST