గతంతో పోలిస్తే భారీగా ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే..!

ABN , First Publish Date - 2021-01-21T23:22:33+05:30 IST

సంక్రాంతి అంటే చాలు ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తారు. సంక్రాంతి సంబరాలు అంటేనే పల్లెటూరు గుర్తుకువస్తుంది. పట్టణాల్లో...

గతంతో పోలిస్తే భారీగా ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే..!

హైదరాబాద్: సంక్రాంతి అంటే చాలు ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తారు. సంక్రాంతి సంబరాలు అంటేనే పల్లెటూరు గుర్తుకువస్తుంది. పట్టణాల్లో పల్లెటూరు వాతావరణాన్ని తెచ్చినా పల్లెటూరులో ఉండే ఆ సందడే వేరు. ఈ సంక్రాంతికి దాదాపు 8 రోజులు నేషనల్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించిన వాహనాల టోల్ ఫీజు ఆదాయం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. గత సంక్రాంతికి రూ. 23.85 కోట్లు టోల్ ఫీజు వసూళ్లు వచ్చాయి. ఈ సంక్రాంతికి రూ.29.30 కోట్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే రూ. 5.46 కోట్లు ఎక్కువ వచ్చినట్లు స్పష్టమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఎక్కువగా సొంత వాహనాల్లో వెళ్లారు. ఈ సంక్రాంతికి మొత్తం 20 లక్షల 55 వేల 800 వాహనాలు టోల్ గేట్ల నుంచి ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-01-21T23:22:33+05:30 IST