గల్లా జయదేవ్ కు షాక్...

ABN , First Publish Date - 2020-06-30T22:06:57+05:30 IST

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సంస్థ ‘అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్’కు గతంలో కేటాయించిన 253 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గల్లా జయదేవ్ కు షాక్...

అమరావతి : తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సంస్థ ‘అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్’కు గతంలో కేటాయించిన 253 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 


ఏపీఐఐసీ కింద గత ప్రభుత్వం అమర్ రాజా ఇన్‌ఫ్రాకు 253 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే... ఆ భూముల్లో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలూ జరగకపోవడంతో... వాటిని వెనక్కు తీసుకుంటున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 


చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలోని సర్వే నెం 65/1  లోని ఈ  భూములను వెనక్కు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Updated Date - 2020-06-30T22:06:57+05:30 IST