BJPకి TRS ఊహించని ఝలక్..
ABN , First Publish Date - 2022-06-27T15:19:17+05:30 IST
తెలంగాణలో టీఆర్ఎస్ (TRS) వర్సెస్ బీజేపీ (BJP) పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ తాజాగా బీజేపీకి ఊహించని ఝలక్ ఇచ్చింది.
Hyderabad : తెలంగాణలో టీఆర్ఎస్ (TRS) వర్సెస్ బీజేపీ (BJP) పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ తాజాగా బీజేపీకి ఊహించని ఝలక్ ఇచ్చింది. 3, 4 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక అలాంటి సమావేశాలు అంటే పార్టీలు ప్రచారం హోరెత్తిస్తాయి. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు(Flexies), బ్యానర్ల(Banners)తో ఊదరగొట్టేస్తాయి. అయితే బీజేపీ ప్రచారంపై టీఆర్ఎస్ నీరు జల్లింది. ప్రకటనల కోసం ముందస్తుగా మెట్రో పిల్లర్ల(Metro Pillers)ను టీఆర్ఎస్ పార్టీ బుక్ చేసుకుని బీజేపీకి అవకాశం లేకుండా చేసింది. ఇక సిటీలో బీజేపీకి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్(Advertisements)కు తావు లేకుండా చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. L&T, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతో వారం రోజులు ప్రి ప్లాన్డ్గా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2300లకు పైగా మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రచారం నిర్వహిస్తోంది. సిటీలోని వెయ్యి బస్టాప్లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మొత్తానికి బీజేపీ తేరుకునే లోగా టీఆర్ఎస్ పని చక్కబెట్టేసింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో వేచి చూడాలి.