శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్కు నెగటివ్.. ట్రైనింగ్కు లైన్ క్లియర్
ABN , First Publish Date - 2022-02-08T22:17:35+05:30 IST
విండీస్తో తొలి వన్డేకు ముందు కరోనా బారినపడిన టీమిండియా భారత ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్
న్యూఢిల్లీ: విండీస్తో తొలి వన్డేకు ముందు కరోనా బారినపడిన టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధవన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్గా తేలింది. దీంతో వారిద్దరి ట్రైనింగ్కు లైన్ క్లియర్ అయింది. అయినప్పటికీ విండీస్తో రేపు (బుధవారం) జరగనున్న రెండో వన్డేకు కూడా వీరద్దరూ దూరమయ్యారు. బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో వీరిద్దరూ నేడు కొంత సమయం పాటు ట్రైనింగ్లో పాల్గొన్నారు.
ఇక, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా ఐసోలేషన్లోనే ఉన్నాడు. తొలి వన్డేకు ముందు శ్రేయాస్ అయ్యర్, ధవన్, రుతురాజ్, నవదీప్ సైనీ కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో తొలి వన్డేకు వీరందరూ దూరమయ్యారు. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేపటి మ్యాచ్లో కనుక రోహిత్ సేన విజయం సాధిస్తే సిరీస్ భారత వశమవుతుంది.