ఏపీలో పార్టీపై షర్మిల స్పందన

ABN , First Publish Date - 2022-01-07T23:31:39+05:30 IST

ఏపీలో పార్టీపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల స్పందించారు. శుక్రవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ

ఏపీలో పార్టీపై షర్మిల స్పందన

అమరావతి: ఏపీలో పార్టీపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల స్పందించారు. శుక్రవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను  చెప్పానని తెలిపారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందన్నారు. వైఎస్‌ఆర్‌ని ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే ఇక్కడ పార్టీ పెట్టాననని, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని జోస్యం చెప్పారు. అధికారంలో ఉంటాను అనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. అధికారంలో లేనివారు.. అధికారంలోకి రారనుకోకూడదని, పాలిటిక్స్ అంటేనే అప్ అండ్ డౌన్ ఉంటాయని షర్మిల వ్యాఖ్యానించారు.


కొంత కాలంగా తన సోదరుడు సీఎం జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. మొన్న పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్త గుప్పుమంది. అంతేకాదు జగన్ ఏపీలో ఉండి ఇక్కడ తెలంగాణలో తనకు నష్టం కలిగిస్తున్నారని షర్మిల అభిప్రాయం పడుతున్నట్లు సమాచారం. వాటన్నింటికి తెరదించేలా ఏపీలో కూడా షర్మిల పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-01-07T23:31:39+05:30 IST