ముగిసిన విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు

ABN , First Publish Date - 2020-03-29T08:40:07+05:30 IST

ప్రపంచం యావత్తూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చినముషిడివాడలో గల శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర ...

ముగిసిన విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు

పెందుర్తి (విశాఖపట్నం) మార్చి 28: ప్రపంచం యావత్తూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చినముషిడివాడలో గల శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు శనివారం ముగిశాయి. పీఠం ప్రాంగణంలోని యాగశాలలో 11 రోజులుగా చేపట్టిన ఈ యాగాలకు రుత్వికులు శాస్ర్తోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు.


ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణ చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తరిమికొట్టేందుకు, సర్వ మానవాళి ఆరోగ్యం కోసం ఈ యాగాన్ని చేపట్టామన్నారు. యాగంతో పాటు అరుణపారాయణ, అపమృత్యుదోష నివారణ కోసం మంత్రోచ్ఛారణ పఠనం చేశామన్నారు. భారతదేశం ప్రపంచానికే గురుస్థానంలో ఉందని తెలిపారు. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలని సూచించారు. అన్నార్తులను ఆదుకోవాలని భక్తులకు స్వామీజీ పిలుపునిచ్చారు.


Updated Date - 2020-03-29T08:40:07+05:30 IST