తొలి ఓవర్లోనే చెన్నైకి షాక్.. వాట్సన్ ఔట్
ABN , First Publish Date - 2020-09-20T03:22:59+05:30 IST
ఐపీఎల్ తొలి మ్యాచ్లో భాగంగా ముంబై నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన...
అబుదాబి: ఐపీఎల్ తొలి మ్యాచ్లో భాగంగా ముంబై నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో.. తొలి ఓవర్లో చివరి బంతికి చెన్నై జట్టు కీలక వికెట్ను కోల్పోయింది. వాట్సాన్ ఒక ఫోర్ కొట్టి ఐదు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. వాట్సన్ ఔట్ కావడంతో డుప్లెసిస్ క్రీజులోకొచ్చాడు. ప్రస్తుతం మురళీ విజయ్, డుప్లెసిస్ బ్యాటింగ్ చేస్తున్నారు.