శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-12-13T22:58:38+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుండి బంగారం తరలిస్తున్న వ్యక్తి దగ్గర 316 గ్రాముల అక్రమ బంగారం సీజ్ చేశారు.
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుండి బంగారం తరలిస్తున్న వ్యక్తి దగ్గర 316 గ్రాముల అక్రమ బంగారం సీజ్ చేశారు. పట్టుకున్న బంగారం విలువ రూ.15 లక్షల 71 వేలు ఉంటుందన్న కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.