భైంసా అల్లర్ల కేసులో పలువురి అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-21T00:37:32+05:30 IST

భైంసా పట్టణంలో అల్లర్ల సందర్భంగా

భైంసా అల్లర్ల కేసులో పలువురి అరెస్ట్

నిర్మల్: భైంసా పట్టణంలో జరిగిన అల్లర్ల సందర్భంగా పలువురిపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. ఇమ్రాన్, సల్మాన్ ఖాన్, మసూద్‌లను పోలీసులు అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. అల్లర్లు జరుగుతున్నపుడు నిందితులు వాహనాలను దగ్ధం చేశారని ఆయన తెలిపారు. నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలతో  సబంధం ఉన్న మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడం కోసం గాలిస్తున్నామని ఎస్పీ వారియర్ తెలిపారు. 


భైంసాలో జరిగిన అల్లర్ల సంఘటనలో మొత్తం పోలీసులు ఇప్పటి వరకు 21 కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-03-21T00:37:32+05:30 IST