శేషాచల కాలనీలోని రూమ్ నెం.75ను జప్తు చేసిన టీటీడీ

ABN , First Publish Date - 2021-05-18T02:01:11+05:30 IST

శేషాచల కాలనీలోని రూమ్ నెం.75ను టీటీడీ జప్తు చేసింది. తిరుమలలో నిర్వాసితుడైన శ్రీనివాసన్‌కు టీటీడీ ఇంటిని కేటాయించింది.

శేషాచల కాలనీలోని రూమ్ నెం.75ను జప్తు చేసిన టీటీడీ

తిరుపతి: శేషాచల కాలనీలోని రూమ్ నెం.75ను టీటీడీ జప్తు చేసింది. తిరుమలలో నిర్వాసితుడైన శ్రీనివాసన్‌కు టీటీడీ ఇంటిని కేటాయించింది. గతేడాది అనారోగ్యంతో శ్రీనివాసన్‌ మృతి చెందాడు. శ్రీనివాసన్‌‌కు వారసులు లేకపోవడంతో టీటీడీ ఇంటిని స్వాధీనం చేసుకుంది. ఇంట్లో 2 ట్రంకు పెట్టెల్లో ఉన్న డబ్బును టీటీడీ విజిలెన్స్‌ గుర్తించింది. విజిలెన్స్ సమక్షంలో టీటీడీ సిబ్బంది డబ్బులు లెక్కపెడుతోంది. దాదాపు పది లక్షల వరకు నగదు ఉన్నట్లు గుర్తించారు. తిరుమలకు వచ్చే వీఐపీల దగ్గర యాచించుకుంటూ శ్రీనివాసన్‌ జీవించే వాడని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-18T02:01:11+05:30 IST