చెల్లి.. మళ్లీ

ABN , First Publish Date - 2020-08-15T08:58:37+05:30 IST

అక్కాచెల్లెళ్ల పోరులో మరోసారి సెరెనా విలియమ్స్‌దే పైచేయి అయింది. డబ్ల్యూటీఏ టాప్‌సీడ్‌ ఓపెన్‌లో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో 40 ఏళ్ల వీన్‌సను 38 ఏళ్ల

చెల్లి.. మళ్లీ

కెంటకీ (అమెరికా): అక్కాచెల్లెళ్ల పోరులో మరోసారి సెరెనా విలియమ్స్‌దే పైచేయి అయింది. డబ్ల్యూటీఏ టాప్‌సీడ్‌ ఓపెన్‌లో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో 40 ఏళ్ల వీన్‌సను 38 ఏళ్ల సెరెనా ఓడించింది. రెండోరౌండ్లో సెరెనా 3-6, 6-3, 6-4తో వీన్‌సపై విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రెండు గంటలా 19 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ ఫైట్‌లో వీనస్‌ ఆరంభంలో చెల్లికి గట్టి పోటీ ఇచ్చింది. తొలిసెట్‌ నెగ్గి జోరు మీద కనిపించిన వీన్‌సకు తర్వాతి రెండు సెట్లలో సెరెనా బ్రేక్‌ వేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన ముఖాముఖి పోటీలో సెరెనాకిది 19వ విజయం. వీనస్‌ 12సార్లు గెలిచింది. చివరిసారిగా ఇద్దరూ 2018 యూఎస్‌ ఓపెన్‌లో తలపడగా.. అప్పుడూ సెరెనాదే ఆధిపత్యం. సెమీస్‌ బెర్త్‌ కోసం అమెరికాకే చెందిన షెల్బీ రోజర్స్‌తో సెరెనా తలపడనుంది.

Updated Date - 2020-08-15T08:58:37+05:30 IST