‘సెలక్ట్‌ కమిటీకి బిల్లులు పంపకుంటే చర్యలు తప్పవు’

ABN , First Publish Date - 2020-02-20T03:41:02+05:30 IST

సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపకంటే చర్యలు తప్పవని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘సెలక్ట్‌ కమిటీకి బిల్లులు పంపకుంటే చర్యలు తప్పవు’

అమరావతి : సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపకంటే చర్యలు తప్పవని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మండలి కార్యదర్శిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు.


చైర్మన్‌ ఆదేశాలను కార్యదర్శి తూచా తప్పకుండా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. మండలి కార్యదర్శికి సచివాలయ ఉద్యోగులు మద్దతు తెలపడం విడ్డూరమని.. సీఎంకు కొమ్ము కాయాలనుకుంటే ఆయన ఇంటి ముందు చెక్క భజన చేసుకోవాలని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-02-20T03:41:02+05:30 IST