ఎయిర్పోర్టులో 1.4కేజీల బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2020-10-24T09:06:27+05:30 IST
ఎయిర్పోర్టులో 1.4కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్, అక్టోబర్ 23, (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 1.4 కేజీల బంగారం పట్టుపడింది. విశాఖపట్నం నుంచి శంషాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా బంగారం లభ్యమైంది. వాటి విలువ రూ.70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికులు బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తరలించడానికి యత్నించినట్టు వెల్లడైంది. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.