హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం
ABN , First Publish Date - 2020-03-18T00:44:37+05:30 IST
గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఒక గర్భిణికి బదులు మరో గర్భిణికి వైద్యులు ఆపరేషన్ చేశారు. 9 నెలల గర్భిణికి చేయాల్సిన ఆపరేషన్ను ...
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఒక గర్భిణికి బదులు మరో గర్భిణికి వైద్యులు ఆపరేషన్ చేశారు. 9 నెలల గర్భిణికి చేయాల్సిన ఆపరేషన్ను 7 నెలల గర్భిణి సమతకు చేశారు. శిశువు మృతి చెందగా తల్లి సమత పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.