బాపూజీ విగ్రహావిష్కరణ చేసిన CM KCR
ABN , First Publish Date - 2022-10-02T17:23:34+05:30 IST
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ చేశారు. గాంధీజీ
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి(Secunderabad Gandhi Hospital)లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrasekhar Rao) మహాత్మా గాంధీ (Mahatma Gandhi) విగ్రహావిష్కరణ చేశారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు ఎంజీ రోడ్లో మహాత్ముడి విగ్రహానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.