రైల్వే ఫ్లాట్ ఫారమ్ టికెట్ ధరలు తగ్గింపు
ABN , First Publish Date - 2021-07-26T20:46:56+05:30 IST
తాత్కాలికంగా పెంచిన ప్లాట్ఫారమ్ టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గించారు.
హైదరాబాద్: తాత్కాలికంగా పెంచిన ప్లాట్ఫారమ్ టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గించారు. గతంలో నిలిపేసిన ప్లాట్ఫారం టికెట్ల జారీ తిరిగి పునరుద్ధరించారు. జోన్ నెట్వర్క్లో అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లు పునరుద్ధరించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని డివిజన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో (నాన్ సబర్బన్, సబర్బన్ స్టేషన్లు అన్నింటిలోనూ) తగ్గించిన ప్లాట్ఫారమ్ టికెట్ ధర రూ.10 మాత్రమే. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం ఈ ధర రూ.20.