మహిళా వాలెంటీర్ పై సచివాలయ ఉద్యోగి వేధింపులు

ABN , First Publish Date - 2020-08-07T22:10:33+05:30 IST

మహిళా వాలెంటీర్ పై సచివాలయ ఉద్యోగి వేధింపులు

మహిళా వాలెంటీర్ పై సచివాలయ ఉద్యోగి వేధింపులు

గుంటూరు: మహిళా వాలెంటీర్ ను సచివాలయ ఉద్యోగి వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని గోరంట్లలో ఓ మహిళా వాలెంటీర్ అయిన తనను సచివాలయ ఉద్యోగి వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ధృవీకరణ పత్రం ఆలస్యంపై ప్రశ్నించిన వాలెంటీర్ ను సచివాలయ ఉద్యోగి, తోటి వాలెంటీర్ అసభ్యంగా దూషించారు. అసభ్య దూషణపై వాలెంటీర్ భర్త ప్రశ్నించడంతో వాలెంటీర్ భర్తపై కూడా సచివాలయ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దిశా స్టేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. దిశా స్టేషన్ ఎదుటే బాధిత మహిళా వాలెంటీర్ కన్నీరు పెట్టుకుంది.


Updated Date - 2020-08-07T22:10:33+05:30 IST