ఖమ్మంలో రెండో కరోనా పాజిటివ్ కేసు.. అధికారుల అప్రమత్తం

ABN , First Publish Date - 2020-04-09T18:09:00+05:30 IST

ఖమ్మం: జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఖమ్మంలో రెండో కరోనా పాజిటివ్ కేసు.. అధికారుల అప్రమత్తం

ఖమ్మం: జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం నగరంలో ఖిల్లా ప్రాంతంలో రెండో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఈ ప్రాంతంలో నేడు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పర్యటించారు. స్థానికంగా తెరిచి ఉన్న అన్ని దుకాణాలను మూసేయలని ఆదేశించారు. ఇళ్ల నుంచి బయటకి వచ్చిన వారిని రావొద్దని హెచ్చరించారు. ఖిల్లా ప్రాంతంలో ఇంటింటి సర్వే చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశంతో అధికారులు సర్వే ప్రారంభించారు.

Updated Date - 2020-04-09T18:09:00+05:30 IST