సేవ్ ఇండియా ఫ్రం సేల్ ఇండియా

ABN , First Publish Date - 2021-03-17T06:46:34+05:30 IST

తాకట్టులో భారతదేశం అని దశాబ్దాల క్రితం తరిమెల నాగిరెడ్డి ఆవేదన చెందారు. అమ్మకానికి భారతదేశం అన్న కేంద్ర సర్కారు విధానాన్ని...

సేవ్ ఇండియా ఫ్రం సేల్ ఇండియా

తాకట్టులో భారతదేశం అని దశాబ్దాల క్రితం తరిమెల నాగిరెడ్డి ఆవేదన చెందారు. అమ్మకానికి భారతదేశం అన్న కేంద్ర సర్కారు విధానాన్ని చూసి నేడు భారతదేశంలోని సామాన్య ప్రజలు ఆక్రోశించాల్సిన పరిస్థితి. వివిధ రంగాలకు చెందిన సుమారు వంద ప్రభుత్వరంగ ఆస్తులను విక్రయించడం ద్వారా రానున్న నాలుగేళ్ళలో రూ.5 లక్షల కోట్లు రాబట్టడానికి నీతిఆయోగ్ విధివిధానాలు సిద్ధం చేసిందన్న వార్త, కేంద్ర సర్కారు ‘అమ్మకానికి భారతదేశం’ అన్న తమ విధానాన్ని అమలుపరచడంలో నిర్విచక్షణతో ముందుకు సాగుతోందనడానికి నిదర్శనం. మేం అధికారంలోకి వస్తే ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ అమ్మివేస్తాం అని భారతీయ జనతాపార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఓట్లు వేయించుకుందా? విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కుతీసుకొచ్చి జనాల జేబులు నింపుతామని చెప్పి ఓట్లు వేయించుకుని, దేశంలోని మూల ధనాన్ని అమ్మివేసి కార్పొరేట్ల ఖజానా నింపే విధానాన్ని అమలు చేస్తున్న కేంద్రప్రభుత్వ పెద్దలు, భారత ఒప్పంద చట్టం ప్రకారం ‘బ్రీచ్ అఫ్ కాంట్రాక్ట్’ క్రింద శిక్షార్హులు కాకపోవడం భారతీయ చట్టాలు లోపభూయిష్టం అనడానికి తార్కాణమేమో? సేవ్ ఇండియా ఫ్రం సేల్ ఇండియా అని అరవడమే ప్రస్తుతం ప్రజలకు మిగిలిన ఏకైక వాదం, నినాదం.

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2021-03-17T06:46:34+05:30 IST