సౌదీపై మ‌హ‌మ్మారి పంజా.. ఒక్క‌రోజే...

ABN , First Publish Date - 2020-07-01T14:25:56+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. సౌదీలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న కోవిడ్‌-19 వ‌ల్ల అంత‌కంత‌కు పాటిజివ్ కేసులు పెరుగుతున్నాయి.

సౌదీపై మ‌హ‌మ్మారి పంజా.. ఒక్క‌రోజే...

రియాద్‌: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. సౌదీలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న కోవిడ్‌-19 వ‌ల్ల అంత‌కంత‌కు పాటిజివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం కూడా 4,387 కొత్త కేసులు న‌మోదయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌రకు సౌదీలో ఈ వైర‌స్ బారిన ప‌డిన వారి సంఖ్య 1,90,823కు చేరింది. నిన్న‌ 3,648 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న‌వారు 1,30,766 మంది అయ్యారు. ఇక మంగ‌ళ‌వారం సంభ‌వించిన 50 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఆ దేశంలో ఈ మ‌హ‌మ్మారికి బ‌లైన‌వారి సంఖ్య‌ 1,649కు చేరింది. అలాగే ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 58,408 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 2,278 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌‌‌ ఈ వైర‌స్ ఇప్ప‌టికే ఐదు లక్ష‌లకు పైగా మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. కోటికి పైగా మందికి ప్ర‌బ‌లింది. 

Updated Date - 2020-07-01T14:25:56+05:30 IST