పెద్దిరెడ్డివి చౌకబారు వ్యాఖ్యలు: అనగాని సత్యప్రసాద్
ABN , First Publish Date - 2021-04-13T19:07:53+05:30 IST
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై జరిగిన దాడిని ఖండించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు మీద వున్న రాయి తీసుకుని కావాలని చూపిస్తే కార్యకర్తకు గాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను తప్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులు చూస్తూ మిన్నుకుండి పోవడం బాధాకరమని అనగాని సత్యప్రసాద్ అన్నారు.