నాలా ఎవరూ మోసపోవద్దంటున్న సత్యదేవ్.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2021-03-12T21:15:50+05:30 IST

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ.. సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్న

నాలా ఎవరూ మోసపోవద్దంటున్న సత్యదేవ్.. ఎందుకో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై తెలంగాణ పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ.. సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్న వీటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ తరహా మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రముఖ నటుడు సత్యదేవ్ మీమ్‌తో ఓ సరదా పోస్ట్‌ను ట్వీట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన ‘ఎకనమిక్ అఫెన్సెన్ వింగ్’ ఈ ట్వీట్ చేసింది. 


‘‘ఇంజినీరింగ్ అయ్యాక నేను కూడా నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఈబిజ్‌లో జాయిన్ అయ్యా.. సెకండ్ మంత్ వాడు ఎత్తేశాడు. నాలాగ మీరెవరూ మోసపోవద్దు. ఇలాంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ స్కీములలో జాయిన్ అయ్యి డబ్బులు పోగొట్టుకోకండి’’ అని సత్యదేవ్ వేడుకుంటున్నట్టుగా మీమ్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-03-12T21:15:50+05:30 IST