పీఎం కేర్స్ ఫండ్‌కు సత్య నాదెళ్ల భార్య రూ. 2 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-01T01:45:52+05:30 IST

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ళ భారత ప్రభుత్వానికి చెందిన

పీఎం కేర్స్ ఫండ్‌కు సత్య నాదెళ్ల భార్య రూ. 2 కోట్ల విరాళం

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ళ భారత ప్రభుత్వానికి చెందిన ‘పీఎం కేర్స్’ ఫండ్‌కు రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. అనుపమ నాదెళ్ల ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి రూ. 2 కోట్ల విరాళమిచ్చారు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజల కోసం ఈ డబ్బును ఖర్చుచేయమంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మరోమారు విరాళాన్ని ప్రకటించడంతో ఆమెపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అనుపమ నాదెళ్ల విదేశాల్లో ఉన్నప్పటికి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి విరాళాన్ని ప్రకటించడం ఆమెకు తన మాతృదేశం పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తోందంటూ వెంకయ్య నాయుడు కొనియాడారు.



Updated Date - 2020-04-01T01:45:52+05:30 IST