ఎమ్మెల్యేల్లో సంతృప్తి: జగ్గిరెడ్డి

ABN , First Publish Date - 2020-06-07T08:39:34+05:30 IST

జగన్‌ పాలనలో పార్టీ ఎమ్మెల్యేలందరూ సంతృప్తికరంగా ఉన్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ సమస్యలపై తక్షణం

ఎమ్మెల్యేల్లో సంతృప్తి: జగ్గిరెడ్డి

రావులపాలెం రూరల్‌: జగన్‌ పాలనలో పార్టీ ఎమ్మెల్యేలందరూ సంతృప్తికరంగా ఉన్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ సమస్యలపై తక్షణం స్పందించే నాయకుడని... శాఖల పనితీరుపై సమీక్షలు చేసి లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. ఇసుక విధానంపై జగన్‌ వెంటనే స్పందించారని అన్నారు.  అయితే... మీడియా వక్రీకరించి వార్తలు రాసిందని తెలిపారు.

Updated Date - 2020-06-07T08:39:34+05:30 IST