సంజయ్ యాత్ర మార్పు తెస్తుంది: ఫడ్నవీస్
ABN , First Publish Date - 2021-09-04T22:01:09+05:30 IST
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 8వ రోజు కోనసాగుతోంది. పాదయాత్రలో మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ మంత్రి చంద్రశేఖర్..
వికారాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 8వ రోజు కోనసాగుతోంది. పాదయాత్రలో మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీలు గరికపాటి మోహనరావు, చాడ సురేష్రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ సంజయ్ యాత్ర తెలంగాణలో మార్పు తెస్తుందన్నారు. రైతులు సమస్యలను వినడానికే సంజయ్ మీ వద్దకు వచ్చారని ఆయన తెలిపారు. ఎప్పుడైనా కేసీఆర్ మీ దగ్గరికి వచ్చారా అని ప్రశ్నించారు. పోరాటం ప్రారంభమైందని, సంజయ్కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. శ్రీశైలం నుంచి వచ్చిన స్వామీజీలు బండి సంజయ్ని ఆశీర్వదించారు.