సీఎం కేసీఆర్‌ను కలిసిన పాగాల

ABN , First Publish Date - 2022-01-28T05:54:09+05:30 IST

సీఎం కేసీఆర్‌ను కలిసిన పాగాల

సీఎం కేసీఆర్‌ను కలిసిన పాగాల
సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాన్నందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి

చిలుపూర్‌, జనవరి 27: టీఆర్‌ఎస్‌ పార్టీ జనగామ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్యతో కలిసి గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకున్న పాగాల సీఎం కేసీఆర్‌ను కలిశారు. శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంపత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-28T05:54:09+05:30 IST