వేతనాల్లో కోతపై పునరాలోచించాలి: ఐక్య వేదిక

ABN , First Publish Date - 2020-03-31T08:57:51+05:30 IST

వేతనాల్లో కోత నిర్ణయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రభుత్వరంగ, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ ఇంత తీవ్రమైన

వేతనాల్లో కోతపై పునరాలోచించాలి: ఐక్య వేదిక

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): వేతనాల్లో కోత నిర్ణయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రభుత్వరంగ, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ ఇంత తీవ్రమైన నిర్ణయం ఏ దేశంగానీ, ఏ రాష్ట్రం గానీ తీసుకోలేదని సంఘం నేతలు చావ రవి, సదానంద గౌడ అన్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వం నుంచి వేల కోట్ల రాయితీలు పొందుతున్న వ్యాపార వర్గాల రాయితీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జీతాల తగ్గింపు పూర్తి తిరోగమన చర్య అని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.


విద్యుత్‌ ఉద్యోగులకు కోత లేకుండావేతనాలు

లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభం ముసురుకున్నప్పటికీ విద్యుత్‌ ఉద్యోగులకు మార్చి నెలకు సంబంధించిన వేతనాలు చెల్లించాలని విద్యుత్‌ సంస్థలు నిర్ణయించాయి. 

Updated Date - 2020-03-31T08:57:51+05:30 IST