క్వార్టర్స్లో సైనా, సమీర్
ABN , First Publish Date - 2020-02-21T10:07:59+05:30 IST
భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్లో ప్రీక్వార్టర్స్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
స్పెయిన్ మాస్టర్స్ నుంచి శ్రీకాంత్ అవుట్
బార్సిలోనా: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్లో ప్రీక్వార్టర్స్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన రెండోరౌండ్లో శ్రీకాంత్ 6-21, 17-21తో సహచరుడు అజయ్ జయరామ్ చేతిలో కంగుతిన్నాడు. ఇక సమీర్ వర్మ 21-14, 16-21, 21-15తో కై షాఫెర్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్స్ చేరాడు. కాగా సైనా నెహ్వాల్ 21-10, 21-19తో ఉలిటినా (ఉక్రెయిన్)ను ఓడించి బుసానన్ (థాయ్లాండ్)తో క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది. మరోవైపు.. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని ద్వయం.. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ ప్రత్యర్థుల చేతిలో ఓడి ప్రీక్వార్టర్స్లోనే వెనుదిరిగారు.