బ్లేజ్కు రూ.510 కోట్ల నిధులు
ABN , First Publish Date - 2021-07-29T05:49:44+05:30 IST
ఆటోమోటివ్, మొబిలిటీ, స్మార్ట్ రిటైల్ రంగాలకు ఎడ్జ్ ఏఐ కంప్యూటింగ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆటోమోటివ్, మొబిలిటీ, స్మార్ట్ రిటైల్ రంగాలకు ఎడ్జ్ ఏఐ కంప్యూటింగ్ సొల్యూషన్లను అందిస్తున్న బ్లేజ్కు 7.1 కోట్ల డాలర్ల (దాదాపు రూ.510 కోట్లు) నిధులు లభించాయి. సిరీ్స-డీ కింద ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, కొత్త ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సమీకరించినట్లు బ్లేజ్ సీఈఓ దినకర్ మునగాల తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, టెమాసెక్ ఆధ్వర్యంలో సిరీ్స-డీ నిధులను ఇన్వెస్టర్లు అందించారు.