జీఎస్‌టీ పరిహారం కింద రూ.268 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-04-09T10:04:35+05:30 IST

వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) పరిహారం కింద రాష్ట్రానికి రూ.268 కోట్లు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు జీఎ్‌సటీ పరిహారం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ఫిబ్రవరి 17న తొలివిడతగా రూ 19,

జీఎస్‌టీ పరిహారం కింద రూ.268 కోట్లు విడుదల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) పరిహారం కింద రాష్ట్రానికి రూ.268 కోట్లు వచ్చాయి.  కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు జీఎ్‌సటీ పరిహారం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ఫిబ్రవరి 17న తొలివిడతగా రూ 19, 950 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. తాజాగా 14, 103 కోట్లు విడుదల చేసింది. దీంతో గత అక్టోబరు-నవంబరు మాసాలకు సంబంధించిన పరిహారం 34,000 కోట్లు చెల్లించినట్లయింది. ఈ రెండో విడతలో రాష్ట్రానికి రూ.268 కోట్లు వచ్చినట్లయింది. రాష్ట్రంలో పన్నుల వృద్ధి రేటు 14 శాతానికంటే తక్కువగా ఉంటుండడంతో పరిహారం లభిస్తోంది.

Updated Date - 2020-04-09T10:04:35+05:30 IST