కృష్ణా జిల్లా పెనమలూరులో రూ.183 కోట్ల కుంభకోణం: జవహర్‌

ABN , First Publish Date - 2020-07-05T22:07:46+05:30 IST

ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతూ.. మరోవైపు దళితుల భూములు లాక్కుంటోందని మాజీ మంత్రి జవహర్‌ ఆరోపించారు.

కృష్ణా జిల్లా పెనమలూరులో రూ.183 కోట్ల కుంభకోణం: జవహర్‌

విజయవాడ: ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతూ.. మరోవైపు దళితుల భూములు లాక్కుంటోందని మాజీ మంత్రి జవహర్‌ ఆరోపించారు. భూముల కొనుగోళ్లలో వైసీపీ నేతలు రూ.1,600 కోట్లు దోచుకున్నారని, పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.690 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కృష్ణా జిల్లా పెనమలూరులో రూ.183 కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శించారు. ఇళ్ల స్థలాల కోసం మార్కెట్ రేటు కంటే ఎక్కువ చెల్లించి కొంటున్నారని, ఆ భూములన్నీ వైసీపీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులవేనని తెలిపారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు తన 100 ఎకరాల పొలాన్ని మార్కెట్‌ ధర కంటే 3 రెట్లు అధికంగా అమ్మారని జవహర్‌ తెలిపారు.


Updated Date - 2020-07-05T22:07:46+05:30 IST