తెలంగాణలో ఫ్రెష్ టు హోమ్ రూ.1,000 కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2022-06-24T06:54:37+05:30 IST
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫ్రెష్ టు హోమ్’ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంంది.
బెంగళూరు: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫ్రెష్ టు హోమ్’ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కంపెనీ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర జనాభాలో 98 శాతం మంది మాంసాహారులు కావడంతో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆరు నెలల్లో హైదరాబాద్లో ‘ఫ్రెష్ టు హోమ్’ అమ్మకాలు ఆరు రెట్లు పెరిగాయి. కంపెనీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యాభైకి పైగా నగరాలు, పట్టణాల్లో చేపలు, చికెన్, మటన్ వంటి రెండు వేలకు పైగా ఉత్పత్తులు విక్రయిస్తోంది.