ఆర్సీబీ..ఆటాపాటా!
ABN , First Publish Date - 2020-10-01T09:35:39+05:30 IST
ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
దుబాయ్: ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు, మ్యాచ్ అనంతరం ఆటాపాటలతో ఎంజాయ్ చేశారు. తొలుత జట్టు సభ్యు లు రెండు బృందాలుగా ఏర్పడి పూల్ వాలీబాల్ ఆడారు. ఇందులో కెప్టెన్ కోహ్లీతో పాటు డివిల్లీర్స్, ఆడమ్ జంపా, పార్థివ్ పటేల్ పాయింట్ల కోసం బాగా పోటీపడ్డారు. అనంతరం మ్యూజికల్ నైట్లో స్పిన్నర్ చాహల్ హిం దీ, కోహ్లీ పంజాబీ పాటలు పాడుతూ సహచర సభ్యులను అలరించారు. చాహల్ పాడుతున్నంత సేపు అతడి హావభావాలు చూసి కోహ్లీ నవ్వుతూనే ఉన్నాడు. డివిల్లీర్స్ కూడా పాటలు పాడుతూ సందడి చేశాడు.