గోదావరి, కృష్ణా నదుల్లో రోశయ్య అస్థికలు నిమజ్జనం
ABN , First Publish Date - 2021-12-09T08:40:32+05:30 IST
ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి
రాజమహేంద్రవరం అర్బన్/వన్టౌన్/గన్నవరం, డిసెంబరు 8: ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అస్థికలను రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలో రోశయ్య కుమారులు శివసుబ్బారావు, ఎస్ఎన్ మూర్తి బుధవారం నిమజ్జనం చేశారు. అనంతరం ఆయన కుమారులు విజయవాడ చేరుకుని దుర్గాఘాట్లో అస్థికలు నిమజ్జనం చేశారు.