చెట్టు వేరు చూసి హడలెత్తిన జనం

ABN , First Publish Date - 2020-04-10T23:42:49+05:30 IST

పామా.. ఇంత పొడవు ఉందా అని.. మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది పాము కాదు చెట్టు వేర్లు.. దీన్ని చూసిన వారందరూ మొదట్లో భయపడ్డారు. మరికొందరు ఆశ్చర్యానికి గురయ్యారు.

చెట్టు వేరు చూసి హడలెత్తిన జనం

అనంతపురం: పామా.. ఇంత పొడవు ఉందా అని.. మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది పాము కాదు చెట్టు వేర్లు.. దీన్ని చూసిన వారందరూ మొదట్లో భయపడ్డారు. మరికొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు కథ తెలిస్తే మీరు కూడా అవాక్కయిపోతారు. అసలు విషయం తెలుసుకుందాం పదండి.. అనంతపురం జిల్లా సోమందేపల్లె గ్రామం ఇందిరానగర్‌ కాలనీలో ఇటీవల నీటి సమస్యతో సతమతమవుతున్నారు. ఇది కాస్త ఈ పది రోజుల్లో తీవ్రమయి నీటి సరఫరా ఆగిపోయింది. ఇక చేసేది ఏమీ లేక మరమ్మత్తు చేయాలని గ్రామ పంచాయతీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. నీటి పైపులను కోసి చూడగా ఒక్కసారిగా మరమ్మత్తు చేస్తున్న వ్యక్తి భయపడ్డాడు. పైపుల్లో పెద్ద పాము ఉందని బెంబేలెత్తిపోయాడు. ఎలాగో సహసం చేసి పైపులు తొలగించారు. దాదాపుగా 15 మీటర్ల పొడవు ఉన్న చెట్టు వేర్లు పైపుల్లో దాగి ఉన్నాయి. దీంతో వేర్లను బయటకు లాగారు. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితేనేం ఎట్టకేలకు గ్రామస్తుల నీట సమస్య తొలగిపోయింది. దీంతో గ్రామస్తులు, పంచాయతీ పెద్దలు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2020-04-10T23:42:49+05:30 IST