WestIndies vs India : భారీ టార్గెట్ నిర్దేశించిన భారత్.. చివర్లో అదరగొట్టిన దినేష్ కార్తీక్..
ABN , First Publish Date - 2022-07-30T03:30:10+05:30 IST
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా (West Indies vs India) తొలి టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
తరౌబా, ట్రినిడాడ్ : వెస్టిండీస్ వర్సెస్ ఇండియా (West Indies vs India) తొలి టీ20 మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి వెస్టిండీస్కి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) 64 పరుగులకు తోడు చివర్లో దినేష్ కార్తీక్ (Dinesh karthik) 4 ఫోర్లు, 2 సిక్సర్లతో దుమ్మురేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి వెస్టిండీస్ ముందు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ట్రినిడాడ్ తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
స్కోర్ బోర్డ్..
భారత బ్యాటింగ్ : రోహిత్ శర్మ(64), సూర్యకుమార్ యాదవ్(24), శ్రేయస్ అయ్యర్(0), రిషబ్ పంత్(14), హార్ధిక్ పాండ్యా (1), రవీంద్ర జడేజా (16), దినేష్ కార్తీక్(41 నాటౌట్(19బాల్స్), రవిచంద్రన్ అశ్విన్(13 నాటౌట్). ఇక వెస్టిండీస్ బౌలర్లలో విషయానికి వస్తే జోసెఫ్ 2 వికెట్లు తీయగా.. మెక్కే, జాసన్ హోల్డర్, హోసెన్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు.