చెట్టును ఢీకొన్న కారు: ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-02-08T17:27:39+05:30 IST

కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకాలో సోమవారం తెల్లవారుజామున జోడిరంగాపుర వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి

చెట్టును ఢీకొన్న కారు: ముగ్గురి మృతి

బెంగళూరు: కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకాలో సోమవారం తెల్లవారుజామున జోడిరంగాపుర వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినవారు మృత్యువాత చెందారు. గీత (32), కుమార్తె ధృతి (5), ఆమె తల్లి శారద (60) మృతి చెందినవారు. ఇంకా నాగేశ, దయానంద, సుధీంద్ర గాయపడ్డారు. క్షతగాత్రులను శివమొగ్గ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఉడుపి జిల్లా కుందాపుర నివాసులు. కుందాపుర నుంచి బెంగళూరుకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలిస్తుండగా గీత, ఆమె తల్లి, కుమార్తె మార్గమధ్యలోనే మృతిచెందారు. హొసదుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-08T17:27:39+05:30 IST