Nizamabad: ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-01-22T17:21:30+05:30 IST

వేల్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కోర జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే

Nizamabad: ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, ఇద్దరు మృతి

నిజామాబాద్: వేల్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కోర జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు బాధితుడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు కమ్మర్ పల్లి మండలం నాగపూర్ గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-01-22T17:21:30+05:30 IST