స్టేషన్ ఘనపూర్‎లో Road accident..ఏడుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-11-21T14:30:40+05:30 IST

స్టేషన్ ఘనపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంద్రనగర్ దగ్గర ఆగి ఉన్న టూరిస్టు బస్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, నలుగురు

స్టేషన్ ఘనపూర్‎లో Road accident..ఏడుగురికి గాయాలు

జనగామ: స్టేషన్ ఘనపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంద్రనగర్ దగ్గర ఆగి ఉన్న టూరిస్టు బస్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్‌లో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గోవా వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాధితులది హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటగా పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-11-21T14:30:40+05:30 IST