ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-06T13:35:00+05:30 IST

చౌటుప్పల్ మండలం తూప్రాన్‎పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై ఆగివున్న డీసీఎంను కారు

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ మండలం తూప్రాన్‎పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై ఆగివున్న డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-07-06T13:35:00+05:30 IST