ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి
ABN , First Publish Date - 2022-06-23T12:12:41+05:30 IST
ఖిలావరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది
వరంగల్: ఖిలావరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వర్ధన్నపేటకు చెందిన గణేష్గా పోలీసులు గుర్తించారు.